సిరా న్యూస్, చిగురుమామిడి:
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, బొమ్మనపల్లి గ్రామాల్లో టీ సెర్ప్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించే వెసులుబాటు కలిగించడం సంతోషంగా ఉందని పలువు రైతులు అన్నారు. మద్దత్తు ధర చెల్లించి వరి కొనుగోలు చేయడంతో రైతులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్, వెంకట మల్లు, వెంకటేశ్వర్లు, కంపల్లి అరుణ, నిలిగొండ రజినీ, వీవూలు, రైతులు పాల్గొన్నారు.