సిరాన్యూస్, ఓదెల
చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మార్వో యాకన్న
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర గురువారం ఎమ్మార్వో బి యాకన్న చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండలు దంచి కొడుతున్న వేళ కార్యాలయానికి వచ్చే ప్రజలు దాహార్తి తీర్చేయందుకై చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. చలివేంద్రాన్ని మండల ప్రజలు అందరూ వినియోగించుకోగలరని కోరారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువ అవ్వడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ మీ రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్, కృష్ణ, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.