సిరాన్యూస్, కుందుర్పి
యువతకు ఉపాధి కావాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి
* ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
గ్రామాలు అభివృద్ది చెందాలన్న, యువతకు ఉపాధి లభించాలన్న తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. కంబదూరు అండేపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు, ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు ఘజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి అంబికా మాట్లాడుతూ ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అనేక దాడులు చేసిన ఈరోజు వైకాపా ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు మహాశక్తి పథకాన్ని తీసుకువస్తారని తప్పకుండ తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలని కోరారు. అమిలినేని మాట్లాడుతూ ఎస్సీలకు సబ్ ప్లాన్ ద్వారా అనేక ఉపాధి పథకాలు ఉండేవాని వాటిని ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని, టీడీపీ అధికారంలోకి వస్తే వాటన్నింటిని పునరుద్దరిస్తామని, గ్రామాలు అభివృద్ధి చెందాలన్న, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలు రావాలన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలాని అభ్యర్థించారు. కార్యక్రమంలో కంబదూరు మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.