సిరాన్యూస్, బేల
ఆదివాసీ బిడ్డను పార్లమెంట్కు పంపిద్దాం
* పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సేద్మకే ఆనంద్ రావ్
ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంట్కు పంపిద్దామని ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సేద్మకే ఆనంద్ రావ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గా ఆదివాసీ ఆడ బిడ్డ ఆత్రం సుగుణక్కను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి చరిత్రలోనే మొదటి సారిగా ఆదివాసీ ఆడ బిడ్డా ఉద్యమ నాయకురాలైన ఓ సాధారణ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణక్క అభ్యర్థి గా అవకాశం ఇవ్వడం మన అదృష్టం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివాసీ ఆడ బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చి గౌరవిస్తే మనం ఆమెను భారీ మెజారిటీతో గెలిపించి, భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, తెలంగాణ తల్లి సోనియాగాంధీ కి బహుమానం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షడు సంజయ్ గుండావార్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ రావ్ వాంఖడే, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు మడావి చంద్రకాంత్, ఆదివాసీ కాంగ్రెస్ నాయకులు, కుర్సెంగ తానాజీ మాజీ సర్పంచ్ పేందుర్ మోహన్, సీనియర్ నాయకులు వైద్య నానజీ, ఆదివాసీ నాయకులు మేస్రం భీర్షావ్, సీనియర్నా యకుడు ధోటే అనిల్ తదితరులు పాల్గొన్నారు.