పార్టీ శ్రేణుల నిరసన
మేయర్;
సిరా న్యూస్,కుత్బుల్లాపూర్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆమె భర్త నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. నిజాంపేట్ రహదారిపై హనుమాన్ ఆలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ మేయర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న మొన్నటి వరకు బీఆర్ ఎస్ లో ఉండి అక్రమాలకు పాల్పడుతూ…. నేడు అధికారం కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని పార్టీ కార్యకర్తలము ఒప్పుకోమన్నారు. కార్పొరేటర్ లో 200 కోట్ల మేర ఆక్రమాలకు పల్పడి నేడు తన పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ లో చేరితే కార్యకర్తలు సహకరించమని హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకూ ప్రజలను పీడించిన మేయర్, భర్త గోపాల్ రెడ్డి , కార్పొరేటర్ లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో కలుపు కోమని, పార్టీ కి మూకుమ్మడిగా రాజినామా చేస్తామన్నారు..
======================