రైతుల పక్షపాతి శ్రీపాదరావు కుటుంబం

కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు
సిరా న్యూస్,కమాన్ పూర్;
రైతుల పక్షపాతి దుద్దిళ్ళ కుటుంబమని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో వైనాల రాజు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైనాల రాజు మాట్లాడుతూ… మంథని నియోజక వర్గ రైతాంగానికి సాగు నీరు అందకపోవడానికి కారణం కేవలం బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజక వర్గంలోని ఒక్క ఎకరమైనా పారిందా అని రాజు అన్నారు. రైతన్నలకు నీరు అందించిన ఘనత శ్రీధర్ బాబుదే అని వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి గుండారం రిజర్వాయర్ లో 2 పి ఎం సి నీరు నింపి వేలాది ఎకరాల సాగు నీటిని మంథని నియోజక వర్గం అందించిన ఘనత శ్రీధర్ బాబుకి దక్కిందని అన్నారు. రైతుల ఆనందమే తమ ఆనందంగా స్వీకరించి శ్రీధర్ బాబు రైతులకు అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఎన్నికలకు స్టంట్ కోసం బి ఆర్ ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రైతన్నల కోసం మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించిన గుండెని రాజు ఎద్దేవా చేశారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్లు అవినీతి చేసి న నాయకులు బిఆర్ఎస్ నాయకులు కదా అని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత వల్ల మేడిగడ్డ మేడిపండు చంద్రన్న మారడంతో నేషనల్ డ్యామ్ దాటి నీటిని తీసి వేయవలసిందిగా సూచించడంతో ఉన్న డ్యామ్ నైనా కాపాడుకోవాలని మీరు బతకడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో మండల అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్ బోస తిరుపతి జంగిల్ కొమురయ్య కొంకం శ్రీనివాస్ అర్కటి అంజన్న కటికిరెడ్డి తిరుపతిరెడ్డి బొజ్జ సతీష్ మామిడి రాజు ల పాల్గొన్నారు.
=====================xx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *