ఇందుర్తి ఖబ్రస్థాన్ లో చెట్లు నరికిన ఇద్దరికి రూ. 20 వేల జరిమానా

సిరా న్యూస్, చిగురుమామిడి:

ఇందుర్తి ఖబ్రస్థాన్ లో చెట్లు నరికిన ఇద్దరికి రూ. 20 వేల జరిమానా

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 936 లో కోర్టు వివాదంలో ఉన్న రెండు ఎకరాల ముస్లిం స్మశాన వాటికలో అక్రమంగా ప్రవేశించి చెట్లను నరికిన ఇద్దరికి రూ.20 వేల జరిమానా విధించినట్లు తిమ్మాపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి శేఖర్ తెలిపారు. చిగురు మామిడి తహశీల్దార్ ఇప్ప నరేందర్ ఫిర్యాదు మేరకు ఇందుర్తి గ్రామానికి చెందిన షేక్ పాషా బేగంకు, తిమ్మాపూర్ మండలం ముస్తలాపూర్ గ్రామానికి చెందిన సోహెల్ అనే వ్యక్తులకు జరిమానా విధించినట్లు తెలిపారు. పెందుర్తి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 936 లోని భూమి హైకోర్టులో డబ్ల్యూపి నెంబర్ 23707/2018 పెండింగ్ లో ఉండగా, కోర్టు వివాదంలో ఉన్న అట్టి భూమిలో ఉన్న వివిధ రకాల చెట్లను అక్రమంగా నరికినందుకుగాను జరిమానా విధించారు. ముస్లిం స్మశాన వాటికను అక్రమంగా కబ్జా చేసిన షేక్ పాషా బేగం కుమారులైన షేక్ ఆసిఫ్ అలియాస్ అంకుశావలి, షేక్ షబ్బీర్, షేక్ సాబీర్, రిజ్వాన్ అజీమ్ మరికొందరు కలిసి సెలవు రోజులు చూసుకొని ముస్లిం ఖబ్రస్తాన్ లో అక్రమంగా ప్రవేశించి చెట్లను నరికి వేసి, నుస్తులపూర్ సామిల్ వ్యాపారులకు అమ్ముకున్నారని ఇందుర్తి మహమ్మదీగా మజీద్ కమిటీ సభ్యులు చిగురు తహసిల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *