కోరుకొండలో ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్ది రుద్రరాజు

సిరా న్యూస్,రాజానగరం;
కోరుకొండ లక్ష్మీ స్వామి ఆలయ వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కోరుకొండ గ్రామంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో అయన సమావేశమైయారు. రుద్రరాజు మాట్లాడుతూ రైతులు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రుద్రరాజు అన్నారు. పేద ప్రజలు ఆనందంగా ఉండాలంటే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ పార్టీ 9 సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు రాబోతుందని రాజు అన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *