సిరాన్యూస్, నేరడిగొండ
గుత్పాలలో జాగ్జీవన్ రామ్ జయంతి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామంలో శుక్రవారం బాబు జాగ్జీవన్ రామ్ జయంతిని అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్ర పటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరు పొందిన స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త, రాజకీయవేత్త ,భారత దేశ పార్లమెంటులో 40 ఏళ్ల పాటుగా వివిధ పదవులు నిర్వహించిన వ్యక్తి భారతదేశ ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషీవలుడు అని కొనియడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దావుల దినేష్ ప్రధాన కార్యదర్శి లింగపెళ్లి సురేష్, కోశాధికారి ఉడుగుల అభిలాష్, కార్యదర్శి లు ఒడ్డెపల్లి సురేష్, చించు రవి, గస్కంటి కిష్టయ్య, సింగరం లస్మన్న, ఉడుగుల సురేష్,దావుల శ్రీనివాస్, కొమురం లక్ష్మన్, భోగి రాజేందర్, గోడం జుగేందర్, సిడం జనార్దన్, గోడం దేవరావు, ఒరగంటి ప్రవీణ్, ఉడుగుల సిద్దార్థ గ్రామస్తులు పాల్గొన్నారు.