సిరాన్యూస్, కడెం
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడువులోనే ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500 రూపాయాలకె గ్యాస్, ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల భీమా, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంటు పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ చెప్పేది చేస్తుందని,చేసేదే చెబుతుందని అన్నారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అనంతరం మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, వందల సంఖ్యలో బీజేపీ, బిఆర్ఎస్, నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలో సాధారంగా ఆహ్వానించారు .
బాబు జగ్జీవన్ రాం ఆశయాల సాధన కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే
డా.బాబు జగ్జీవన్ రాం దేశానికి చేసిన సేవలు మరవలేనివని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.