Rajarshi Shah: అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా
* ప‌ట్ట‌ణంలో ఓటరు అవగాహన ర్యాలీ

18 సంవత్సారాలు నిండిన ప్రతీ ఒక్కరు ఈ నెల 14వ తేది లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. స్వీప్ కార్యక్రమం లో భాగంగా శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి జిల్లా పరిషత్ సమావేశం మందిరం వరకు నిర్వహించిన ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా కాగడాను వెలిగించి ర్యాలీ ని ప్రారంభించారు. అనంత‌రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమములో భాగంగా ఏర్పాటు చేసిన‌ ఓటర్ అవగాహన కార్య‌క్ర‌మంలో జిల్లా పాలనాధికారి మాట్లాడారు. ఈ నెల 14వ తేది వరకు ఓటరుగా నమోదు కు అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 1వ తేది వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల ఫారం -6 నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు కొత్తగా ఓటర్ నమోదు కొరకు ఇవ్వాల్సిందిగా , అంతేకాకుండా ఆన్లైన్ దరఖాస్తు యాప్ లో తమ తమ ఆధార్ కార్డు లేదా ఎస్ ఎస్ సి మార్కు మెమో ఆధారంగా కొత్త ఓటర్ల కొరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ మే 13న జరగబోవు పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా పాల్గొని తమ ఓటును తమ కుటుంబ సభ్యులు ఓటును వినియోగంచుకోవాలని తెలిపారు.అనంతరం సమావేశం లో పాల్గొన్న వారితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ డీవైఎస్ ఓ ,డిఎం అండ్ హెచ్ ఓ రిమ్స్ న్స్ డైరెక్టర్ , డి డబ్ల్యూ ఓ, ఆర్ డి ఓ , మున్సిపల్ కమిషనర్ అర్బన్ రూరల్ తాసిల్దార్లు , మావల మండల్ అధికారులు , అంగన్వాడీలు ఆశ వర్కర్లు, మేడికోస్, పిడి మెప్మా , ఆర్పిఎస్ .లు ఆర్ పి ఎస్ లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *