సిరాన్యూస్, బోథ్
నాగభూషణం పాఠశాల ఆధ్వర్యంలో నీటి తొట్టెల ఏర్పాటు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నాగభూషణం పాఠశాల ఆధ్వర్యంలో శనివారం వేసవిలో మూగ జీవాలు దప్పిక తీర్చడం కోసం రెండు నీటి తొట్టెలను ఘాట్ సెక్షన్ ప్రాంతం లో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులుకు జంతువుల పట్ల ఎలా మెలగాలో , భవిష్యత్తులో విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని సూచించారు. అదిలాబాద్ నుండి నిర్మల్ వైపు ఎవరైనా వెళ్తున్నప్పుడు నీళ్లు తీసుకొని వెళ్లి అక్కడ నీటి తొట్టెలో నీరు పోసినట్లు అయితే బాగుంటుంది అని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.