-సహాయ రిటర్నింగ్ అధికారి, మంథని ఆర్డీవో హనుమా నాయక్
-2వ బ్యాచ్ పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం
సిరా న్యూస్,మంథని;
పోలింగ్ రోజు పాటించాల్సిన ఎన్నికల కమీషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం మంథని శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, మంథని ఆర్డీవో వి. హనుమా నాయక్ అన్నారు. శనివారం రామగిరి లోని జే.ఎన్.టి.యు.హెచ్, యూనివర్సిటి కళాశాల, మంథని లో మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గల 2వ బ్యాచి పోలింగ్ మరియు సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని సహాయ రిటర్నింగ్ అధికారి వి. హనుమా నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
గతంలో అనేక మార్లు పోలింగ్ విధులు నిర్వహించినప్పటికీ ప్రతి ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుందని, కొత్త నిబంధనలు వస్తుంటాయని, అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా పోలింగ్ నిర్వహణ పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత వివిప్యాట్ లో స్లిప్పులను తొలగించాలని, సి.ఆర్.సి తప్పినిసరిగ్గా చేయాలని, పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో తప్పనిసరిగా క్లోజ్ బటన్ నొక్కాలని తెలిపారు.
పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను సెక్టార్ అధికారులకు అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందజేయాలని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్ గుర్తింపు కార్డు పరిశీలించి, ఓటరు జాబితాలో ఉన్న అతని వివరాలు చూసుకుని, రిజిస్టర్ లో పేరు నమోదు చేయాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో తహశీల్దార్లు ఎం.డి. ఆరీఫోద్దిన్, ఎ. నాగరాజు, బి.రాంచందర్, మాస్టర్ ట్రైనర్లు, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, ఎలక్షన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
===================