Johnson Naik..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి..

సిరా న్యూస్, ఖానాపూర్:

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి..

బి ఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్..

రైతులకు మద్దతుగా రైతుదీక్ష..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో భుక్య జాన్సన్ నాయక్ రైతులకు మద్దతుగా  రైతు దీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలనీ, డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా  ఖానాపూర్ పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిపి దీక్ష నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరిధ్యానం పంటకు రూ. 500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12000, ఎండిన పంటకు ఎకరాకు రూ.25000 వెంటనే చెల్లించి. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్టులలో నీళ్లు ఉన్న రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేస్తున్నారని, పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, చనిపోయిన రైతులకు నష్ట పరిహారం తో పాటు, వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *