సిరాన్యూస్, బేల
బేలలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బేల బేల మండల కేంద్రంలో శనివారం 44వ బీజేపీ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా టిఫిన్ భైటక్ కార్యక్రమాన్ని బుత్ అధ్యక్షులు శక్తి కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. మూడవసారీ మోడీ ప్రధానమంత్రి లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ ఠాక్రే, మండల అధ్యక్షులు దత్తానిక్కం, జనరల్ సెక్రెటరీ గణేష్, బోనగిరి వార్ శివకుమార్ కృష్ణ, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, మహేష్, రాము, నారాయణ, కార్తీక్, వేములవార్ గణేష్ , రవి మహేష్, కృష్ణ, బీజేవైయం మండల అధ్యక్షులు నవీన్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు