ఆలయ నిర్మాణానికి విరాళం..

సిరా న్యూస్, సైదాపూర్:

ఆలయ నిర్మాణానికి విరాళం..

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం కోసం, ఆరెపల్లి గ్రామానికి చెందిన బాగోతం వెంకటయ్య రూ. 10,116 విరాళం అందించి తన ఉదారత చాటుకున్నారు. ఆదివారం ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులకు తన విరాళాన్ని అందించారు. కాగా ఆలయ నిర్మాణానికి విరాళామందించిన వెంకటయ్య కుటుంబ సభ్యులకు వెన్నంపల్లి గ్రామ ప్రజల తరపున ఆబ్బిడి రవీందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *