సిరా న్యూస్, సైదాపూర్:
ఆలయ నిర్మాణానికి విరాళం..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం కోసం, ఆరెపల్లి గ్రామానికి చెందిన బాగోతం వెంకటయ్య రూ. 10,116 విరాళం అందించి తన ఉదారత చాటుకున్నారు. ఆదివారం ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులకు తన విరాళాన్ని అందించారు. కాగా ఆలయ నిర్మాణానికి విరాళామందించిన వెంకటయ్య కుటుంబ సభ్యులకు వెన్నంపల్లి గ్రామ ప్రజల తరపున ఆబ్బిడి రవీందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.