సిరా న్యూస్, సైదాపూర్:
దుద్దెనపల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా పోతిరెడ్డి హరీష్ ఏఖాగ్రీవం..
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ నూతన అధ్యక్షునిగా మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షునిగా ఆదిరెడ్డిని ఎనుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపెళ్లి యుగేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ కో-ఆర్డినేటర్ పర్కాల నారాయణ, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్ళపెళ్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సోమారపు ప్రశాంత్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు దూల సురేష్, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, సీనియర్ నాయకులు చాడ అదిరెడ్డి, నాయకులు చెప్యాల రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు పర్శవేని విజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.