Rajura Sathyam: ఈద్గా ప‌నుల ప‌రిశీలించిన మున్సిపల్ చైర్మన్

సిరాన్యూస్‌, ఖానాపూర్:
ఈద్గా ప‌నుల ప‌రిశీలించిన మున్సిపల్ చైర్మన్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కబ్రాస్తాన్ ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమ‌వారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మున్సిపాలిటీ సిబ్బంది చేత కబ్రాస్తాన్ ఈద్గా వద్ద పారిశుద్ధ్య పనులను చేయిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్మా శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ కౌన్సిలర్ షబ్బిర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్,మైనార్టీ మండల అధ్యక్షులు సలీం ఖాన్,పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ పాషా, మైనార్టీ నాయకులు సయ్యద్ ఆయుబ్, షకీల్, శారు, జియా, అమీర్, అఫ్రోజ్, ఈద్గాహ్ నిర్వాహకులు మునవర్ ఖాన్, ఖైసర్, మున్సిపాలిటి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *