రోడ్డు కోసం రోడ్డెక్కిన ప్రజలు

సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం ఆమదాలవస రహదారి పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్న ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికులు మండి పడుతున్నారు.రెండు రోజుల వ్యవధిలో ఈ రోడ్డు పై జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.ఆరు నెలల వ్యవధిలో ఇరవై మందికి పైగా మృతి చెందారు.. వందలాది మంది గాయాల పాలయ్యారు.అత్యంత దారుణంగా మారిన ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఆదివారం శ్రీకాకుళం నుండి ఆమదాలవస రహదారి పై వాకలవస గ్రామం వద్ద నిరశన చేపట్టారు.ఈ నిరశన కార్యక్రమంలో వాకలవలస,వంజంగి గ్రామ ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *