రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి ప్రచారం

సిరా న్యూస్,రైల్వే కోడూరు;
పార్టీల అభ్యర్థులు కన్ఫామ్ కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. టిడిపి బిజెపి నేతలతో కలిసి నియోజకవర్గ పరిధిలోని చిట్వేలు మండలం రాజు గుంట చింతల చేలిక గ్రామం నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు. కార్యకర్తలు నాయకులు వెంటరాగా ఇంటింటికి తిరుగుతూ కూటమి బలపరిచిన తనకు ఓటు వేయాలంటూ జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ ఓటర్లను కోరారు. మూడు పార్టీల సహకారంతో రైల్వేకోడూరులో ఈసారి వైసిపిని కచ్చితంగా ఓడిస్తామని నాయకులు దీమా వ్యక్తం చేశారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *