వసతులు సరిగా లేవని గురుకుల హాస్టల్ విద్యార్థుల ధర్నా

సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో గల బీసీ గురుకుల విద్యార్థులు మంథని కాటారం ప్రధాన రహదారి వరకు దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి ఆరెంద క్రాస్ రోడ్ వద్ద రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ధర్నా చేశారు.
గురుకుల హాస్టల్ లో సరైన వసతులు లేవని, విద్యా సంవత్సరం ముగుస్తున్న సిలబస్ పూర్తి కాలేదని, ఎండాకాలం ప్రారంభం కావడంతో విద్యార్థులకు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, హాస్టల్లో అనారోగ్య సమస్యలతో ఉంటే డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని. విద్యార్థులు వాపోయారు.హాస్టల్ ను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై విద్యార్థులు ధర్నా చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో విద్యార్థులు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగి హాస్టల్ కు చేరుకున్నారు జిల్లా ఉన్నత అధికారులు గురుకుల హాస్టల్ కు చేరుకోని విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
==============xx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *