Mallikarjuna Swamy:భక్తులతో కిటకిటలాడిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం

సిరాన్యూస్, ఓదెల
భక్తులతో కిటకిటలాడిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం

పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ క్రోది నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ లో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. గుడి చుట్టూ వాహనాలు తిప్పుతూ గుడి ముందర వాహన పూజ కార్యక్రమాలు వేదమంత్రాలతో వాహనాల పూజలు నిర్వహించారు.పూజారులు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందున ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య ఆలయ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట్ర చత్తీస్గడ్ నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందున పోత్కాపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *