సిరాన్యూస్, జైనథ్
రూ. 1,96,500 నగదు పట్టివేత
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జైనథ్ మండలంలోని పౌజ్పూర్ వద్ద మంగళవారం టి. శ్రీనివాస్ ఎఫ్ ఎస్ టి టీం లీడర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నరూ.1,96,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మాహారాష్ట్రలోని నాందేడ్ తాలుకాకు చెందిన కిరణ్ పరమేశ్వర్ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా పౌజ్ పూర్ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తు పట్టుబడినట్లు గుర్తించి ఆ డబ్బుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలో గణేష్ పిసి, వెంకటరమణ, తదితరులు ఉన్నారు.