గుడిహత్నూర్ బిజెపి మండల అధ్యక్షునిగా కేంద్ర శివాజీ..

సిరా న్యూస్, గుడిహత్నూర్:

గుడిహత్నూర్ బిజెపి మండల అధ్యక్షునిగా కేంద్ర శివాజీ.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

బిజెపి గుడిహత్నూర్ మండల అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన కేంద్ర శివాజీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవి ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్ కి , అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, కొత్త పాత అని ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా అందరిని కలుపుకుంటూ పోతానని, సీనియర్ నాయకుల సలహా, సూచనలు తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇది ఒక సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవమని అన్నారు. పార్టీకోసం పని చేసే వారిని పార్టీ గుర్తుంచుకుంటుందనడానికి తనే ఒక ఉదాహరణ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *