సిరా న్యూస్,ఏలూరు;
పశ్చిమ గోదవారి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కంట తడి పెట్టారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో భావోద్వేకంలో మునుగిపోయారు. టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపంచెందారు. సీటు వేరే ఒకరికి కేటాయించడానికి సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తానని అన్నారు..