సిరా న్యూస్,రాయ్ పూర్;
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. 45 అడుగుల మట్టి గనిలో బస్సు పడిపోయింది. ఘటనలో 12 మంది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి. డిస్టీలరి సంస్థలో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు వున్నారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.