మొదటిసారి సైకిల్ గుర్తు లేకుండా బ్యాలెట్

బద్వేలు ఓటర్లలో కన్ఫ్యూజన్ అయోమయం
మొదటి నుంచి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసే వాళ్లకు ఇది ఒక పరీక్ష
సిరా న్యూస్,బద్వేలు;

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా బద్వేలు అసెంబ్లీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు లేకుండా పోతుంది. అదే పార్లమెంటు ఎన్నికల సంబంధించి బద్వేలు బ్యాలెట్ లో కూడా సైకిల్ గుర్తు ఉంటుంది బద్వేలు అసెంబ్లీ బ్యాలెట్ లో మొదటిసారి సైకిల్ గుర్తు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో బద్వేలు తెలుగుదేశం అభ్యర్థిగా లెక్చలర్ సింగరయ్య పోటీ చేశారు. ఇది అందరికీ బాగా గుర్తుంది పోతుంది. అదే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వీరారెడ్డి దాదాపు మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వీరారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వీరారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం గెలిచిపోవడం చక చక జరిగిపోయాయి. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉండి మృతి చెందారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె విజయమ్మ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు బద్వేల్ అసెంబ్లీలో బ్యాలెట్ పేపర్ పై సైకిల్ గుర్తు లేకుండా పోలేదు. ఇప్పుడు తాజాగా మే నెలలో జరుగుతున్న
ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ బ్యాలెట్ పై సైకిల్ గుర్తు లేకుండా పోతుం.ది అందుకు బలమైన కారణం లేకపోలేదు. పొత్తుల్లో భాగంగా బద్వేల్ అసెంబ్లీ బిజెపికి కేటాయించడం, అక్కడ బిజెపి అభ్యర్థిని నిలబట్టడం జరిగిపోయింది. దీంతో బద్వేలు అసెంబ్లీ బ్యాలెట్ పేపర్ పై మొట్టమొదటిసారిగా సైకిల్ గుర్తు కనిపించకుండా పోతుంది. ప్రజల్లో ఓట్ల ఓటర్లలో సైకిల్ గుర్తుపై దశాబ్దాల తరబడి పట్టు ఉంది .ఇప్పుడు సైకిల్ గుర్తుకాకుండా కమలం గుర్తుకు ఓటు వేయాలని చెబు తున్నారు. దీంతో బద్వేలు అసెంబ్లీ హోటల్లో కన్ఫ్యూజన్ అయోమయం నెలకొంది. ఓట్లకు ఉన్న కన్ఫ్యూజన్ అయోమయం కూటమి అభ్యర్థి పుట్టి ముంచుతుందేమోనని ఆందోళన లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *