సిరాన్యూస్, నిర్మల్
అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
* మాల మహానాడు నిర్మల్ జిల్లా అధ్యక్షులు దాసరి రాజన్న
ఈనెల 14న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారంగా ఘనంగా నిర్వహించాలని మాల మహానాడు నిర్మల్ జిల్లా అధ్యక్షులు దాసరి రాజన్న అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న మహనీయుల జయంతులను కచ్చితంగా నిర్వహించాలన్నారు. అంబేద్కర్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని మహనీయుడు, ఎప్పటిలాగే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంబేద్కర్ జయంతి అన్ని మండలాల్లో అధికారికంగా ఘనంగా నిర్వహించాలని కోరారు.