కాంగ్రెస్ నుంచి ఐదుగురు బహిష్కరణ

సిరా న్యూస్,మచిలీపట్నం;
కృష్ణాజిల్లాలో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తూ పార్టీ ముఖ్య నేతలపై నిరాదార ఆరోపణలు చేసిన ఐదుగురు వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నుండి ఆరు సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంకు చెందిన దాదా సాహెబ్, శాంతిరాజు, కోన నాగార్జున, గన్నవరంకు చెందిన షేక్ ఛాన్ బాషా, పెడనకు చెందిన కేదారేశ్వరరావులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు.తమకు టికెట్లు దక్కలేదన్న అక్కస్సుతో ఈ ఐదుగురు పార్టీలో క్రమశిక్షణ తప్పి నిరాధార ఆరోపణలు చేశారన్నారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంజీవ్ రెడ్డి తెలిపారు. నేటి నుండి బహిష్కరణకు గురైన వారితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. పార్టీలో ఉన్న నేతలు వీరితో సత్సంబంధాలు పెట్టుకున్నట్టు తెలిస్తే వారిపై కూడా ఇటువంటి కఠిన చర్యలే ఉంటాయని సంజీవ్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *