సిరాన్యూస్, ఇంద్రవెల్లి
బీఆర్ఎస్ షాక్… కాంగ్రెస్లో చేరిన తాజా మాజీ సర్పంచ్లు
* పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్ నగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శారదా, గిన్నెర గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ విజయబాయి, డోంగర్ గావ్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాంచందర్లు గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలో సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకు ఆకర్షితులై తాజా మాజీ సర్పంచ్లు పార్టీలో చేరారని తెలిపారు.