సిరాన్యూస్, జైనథ్
ఉత్తమ కథా రచయిత గా లక్ష్మీపూర్ విద్యార్థి తల్లెల కీర్తి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తల్లెల కీర్తి రాసిన కథ తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిర్వహించిన కథల పోటీల్లో ఉత్తమ కథగా ఎంపికైంది. పోటీకి 61 మంది విద్యార్థులు రాసిన కథలు రాగా అందులో 31 కథలను ఉత్తమ కథలుగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఇందులో తల్లెల కీర్తి రాసిన ‘ రాము – సోము ‘ కథ ఒకటి కావడం గమనార్హం. ఉత్తమ కథలుగా ఎంపికైన 31 కథలను తెలంగాణ సారస్వత పరిషత్ పుస్తక రూపంలో ముద్రించడం జరుగుతుంది. ఈ పుస్తక ఆవిష్కరణ తో పాటు, విద్యార్థులకు బహుమతులు, సన్మానం మే నెల చివరి వారంలో హైదరాబాద్ లో జరుగనుంది. ఈ సందర్భంగా తల్లెల కీర్తిని ప్రధానోపాధ్యాయులు పోరెడ్డి అశోక్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.కీర్తి రాసిన మరొక కథ ‘ ఫోను – చదువు ‘ ఫిబ్రవరి నెల చెకుముకి మాస పత్రికలో ప్రచురితం అయ్యింది.