సిరాన్యూస్, ఉట్నూర్
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ముస్లింలు గురువారం వైభవంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఆనందోత్సవాల మధ్య రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరారు.