సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా సహాబ్ దర్ఘాలో రంజాన్ వేడుకలు, పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజులు ఉపవాస దీక్ష ముగించుకొని వేల సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ అల్లా దీవెనలు ప్రపంచంలో అందరి పైన ఉండి సుఖశాంతులు కలగజేయాలని కోరుకున్నారు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, స్థానిక కార్పొరేటర్, వివిధ పార్టీల ప్రముఖ రాజకీయ నేతలు పాల్గోన్నారు.
===============