సిరా న్యూస్,వేములవాడ;
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం,స్త్రీ జాతి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసి ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే చదువు ఒక్కటే ఆయుధం అని అనేక పాఠశాలలు నెలకొల్పి తను చుదువుతూ, చదువు నేర్పిస్తూ ఎంతో మంది ని తీర్చిదిద్దిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో విలీన గ్రామమైన శాత్రాజ్ పల్లి లో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుడిసె మనోజ్,రేగుల రాజేశం,నల్ల సతీష్ రెడ్డి,వనపర్తి మల్లేశం, గుడిసె మనోజ్ కుమార్,గుడిసె పవన్ కుమార్,వనపర్తి జితేందర్,పులి సంపత్ గౌడ్,చర్ల రమేష్,గుడిసె శంకర్,గుడిసె కుమార్,గుడిసె అనిల్,గుడిసె కరుణాకర్, సామనపల్లి జీవన్,గుడిసె కిషన్,గుడిసె ప్రవీణ్,మూల మునేందర్,పంపుల దేవేందర్ తదితరులు పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు.