సిరాన్యూస్, భీమదేవరపల్లి
భీమదేవరపల్లిలో జ్యోతి బాబు పూలే జయంతి
భీమదేవరపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతి బాబు పూలే 197వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జ్యోతి బాబు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలుర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, మాజీ సర్పంచ్ స్వాతి నాగరాజు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ కమిటీ చైర్మన్ పచ్చునూరి కరుణాకర్, అంబేద్కర్ మాజీ కార్యదర్శి చాగంటి వెంకటేశ్వర్లు, ఎల్కేపల్లి శ్రీనివాస్ సాతుర్ చంటి పచునూరి సునీల్,లింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.