సిరాన్యూస్, ఆదిలాబాద్
సంక్షేమ ఫలాలే బీజేపీని గెలిపిస్తాయి
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* కైలాష్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం
గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలే బిజెపి అభ్యర్థిని గెలిపిస్తాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు.గురువారం కైలాష్ నగర్ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ముందుగా కాలనీ లో ఇంటింటికి తిరుగుతూ నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అనంతరం లాభర్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందిన లబ్దిదారులను కలిసి వారి మద్దతుగా కోరారు. ఆమె వెంట నాయకులు రాకేష్, కాంత, అనిల్, పవన్, రాహుల్, దామోదర్, దీపక్ తదితరులు ఉన్నారు.