Sukumar Petkule: జ్యోతిబాపూలే ఆశ‌య సాధ‌న కోసం కృషి చేయాలి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జ్యోతిబాపూలే ఆశ‌య సాధ‌న కోసం కృషి చేయాలి
అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
* కొవ్వొత్తులు వెలిగించి నివాళుల‌ర్పించిన సంఘం నాయ‌కులు

ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే నూట తొంబై ఏడవ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో గల ఫులే దంపతుల విగ్రహాలకు మాలి మహా సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ స్త్రీ విద్య, మహిళా సాధికారిత, సామాజిక న్యాయం కోసం జ్యోతిబాపూలే దంపతులు ఎనలేని కృషి చేశారని, వారి ఆశయ సాధన కోసం బహుజన కులాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిబాపూలే జయంతి, వర్ధంతిలను అధికారికంగా జరపటం ప్రారంభించిందని, ఆ తర్వాత కాలంలో వచ్చిన తెరాస ప్రభుత్వం కేవలం జయంతులను మాత్రమే అధికారికంగా నిర్వహించి వర్ధంతిని వదిలేసిందని, కానీ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ గా మార్చి జ్యోతిబాపూలే జయంతిని అధికారికంగా నిర్వహించడం మర్చిపోయిందని, ఇది చాలా ఘోరమైన విషయమని, బహుజన కులాలకు అండగా నిలిచిన ఫూలేను అవమానించడమే అవుతుందని, రాబోయే రోజుల్లో నైనా ఈ ప్రభుత్వం జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫూలే దంపతుల జయంతి వర్ధంతి ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మాలీ మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురుణులే, మాలీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, పట్టణ అధ్యక్షులు శ్రీను గురునులే, కార్యవర్గ సభ్యులు అనిల్ కొట్రంగే, భాస్కర్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *