Ailaiah Yadav: ఓదెలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సిరాన్యూస్‌, ఓదెల
ఓదెలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
* నివాళుల‌ర్పించిన జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేట్ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ జ్యోతిరావు పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆరోజుల్లో పూలే ఆడపిల్లల చదువుల కోసం పోరాడారన్నారు. తన భార్య సావిత్రి బాయి పూలే విద్యనభ్యసించిడానికి స్వయంగా ప్రోత్సాహించారని తెలిపారు. అలాగే అంటరాని తనం అమానుషం అని కుల మత రహిత సమాజం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎక్కడ కులం పేరిట మతం పేరిట అసమానతలు లేకుండా సమమాజం ఉంటుందో అక్కడ అభివృధ్ది సాధ్యమని చాటి చెప్పిన ఆ మహనీయుని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం చాలా సంతోషకరమని అయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు బైరి రవి గౌడ్ , మాజీ సర్పంచ్ రామస్వామి , సాతుర్ రాజేశం, గాజుల శివశంకర్, గట్టు రాము, గడ్డం బన్నీ, అట్టపల్లి మధు, తొట్ల ఉదయ్ కుమార్ , అంబుల శంకర్, గుండేటి రజనీకాంత్, శ్రీకాంత్, తుమ్మల అనిల్ కుమార్, చిలుక రవి , అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *