హత్య రాజకీయాలు చేసే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు.

కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు.
సిరా న్యూస్,కమాన్ పూర్;
హత్యలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. ఈ మేరకు కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ.. మంథనిలో రౌడీ రాజకీయాలు చేసింది ఎవరో ఓటర్లకు తెలుసని హత్య చేయించింది ఎవరో ప్రజలు గ్రహించారని రాజు అన్నారు. పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో మంథనిలో రౌడీ రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మంథని గడ్డను రక్తపాతంగా మార్చిన ఘనత అందరికీ తెలుసు అని అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. హత్యలు అంటూ కొత్త రాజాకియాలకు తీరలేపడం సమంజసం కాదని అన్నారు. ఎవరు అక్రమంగా సంపాదించారు ప్రజలు చూశారని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్ జిల్లా కార్యదర్శి భూంపల్లి రాజయ్య జూలపల్లి ఎంపిటిసి శివ శంకరయ్య మండల ప్రధాన కార్యదర్శి భద్రపు శంకర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుక్క రవి గ్రామ శాఖ అధ్యక్షుడు కొంచెం శ్రీనివాస్ ఉస తిరుపతి పిడుగు శంకర్ యాదగిరి రాజయ్య పిడుగురాళ్ల కుమార్ పోషణ రవి రాజు తాటికొండ శేఖర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *