సిరాన్యూస్, బోథ్
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆడే గజేంద్ర
* సామాజిక సేవ కార్యక్రమాలలో ముందు ఉండాలి
సామాజిక సేవ కార్యక్రమాల లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేంద్ర అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా పూలే సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో ముందుంటే ప్రజలు గుర్తింపు ఇస్తారన్నారు. భారత దేశంలో విద్యాభివృద్ధికి పూలే ఎంతగానో కృషి చేశారన్నారు.అట్టడుగు వర్గాల ప్రజల కోసం పాఠశాలలు ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. కార్యక్రమంలో బూత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్ర పూల్ చందర్ రెడ్డి, పూలే వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గాజుల పోతన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్, సాయి కృష్ణ , అమృతరావ్, కే పోతన్న, కొల్లూరి అనిల్, చెట్ల పెళ్లి అనిల్, సొసైటీ సభ్యులు ముండే శ్రీధర్, రాజేష్, జ్ఞానేశ్వర్, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, నాయకులు పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు