సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
రంజాన్ విందుకు హాజరైన మున్సిపల్ చైర్మన్ దంపతులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ 6వ వార్డు కౌన్సిలర్ ఆఫ్రిన బేగం అమానుల్లా ఖాన్ రంజాన్ పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం దంపతులు హాజరయ్యారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు కిషోర్ నాయక్ , జన్నరపు విజయ లక్ష్మి , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , నాయకులు తదితరులు ఉన్నారు.