Currency:క‌రెన్సీ నోట్ల‌పై అవ‌గాహ‌న

సిరాన్యూస్‌, బోథ్‌
క‌రెన్సీ నోట్ల‌పై అవ‌గాహ‌న

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాకర గ్రామ పంచాయితీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ‌నివారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అదిలాబాద్ జనరల్ సెక్రెటరీ బాసెట్టి రాజు కుమార్ పిల్లలకు 40 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోటు, నాణేలపై అవ‌గాహ‌న క‌ల్పించారు. పాతకాలంలో ఉపమోగించిన నాణేలు వాటి విలువ వివరించారు. ప్రస్తుతం హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చేసే సిపిఆర్ చేసేవిధానం, సైబర్ క్రైమ్ గురించి పిల్లలకు చాలా చక్కగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు కమలాకర్, సామాజిక కార్యకర్త శ్రీరామ్ విజయ్, అంగన్వాడి కర్యకర్త సుహిల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *