Vedma Bojju Patel:మహనీయులు చూపిన బాటలో నడవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌, కడెం
మహనీయులు చూపిన బాటలో నడవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ విగ్రహాల‌ ఆవిష్కరణ
* పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్, గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలనీ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శ‌నివారం నిర్మ‌ల్ జిల్లా కడెం మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్, గౌతమ బుద్ధుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్, బుద్ధుడి విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.ఆ మహనీయుడి సిద్ధాంతాలను, ఆలోచనలను నిత్య జీవితంలో పాటించినప్పుడే అదే ఆ మహనీయునికి మన మీచ్చే బహుమానమని అన్నారు.ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆ మహనీయులు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత, బహుజన సంఘాల నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *