kandi Srinivas Reddy: క‌ర‌ప‌త్రాలు, డోర్ స్టిక్క‌ర్ల‌ను ఆవిష్క‌రించిన కంది శ్రీ‌నివాస రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
క‌ర‌ప‌త్రాలు, డోర్ స్టిక్క‌ర్ల‌ను ఆవిష్క‌రించిన కంది శ్రీ‌నివాస రెడ్డి

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ,ప్ర‌జా సేవాభ‌వ‌న్ కాంగ్రెస్ శ్రేణుల‌తో సంద‌డి క‌న‌బ‌డుతోంది.ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా స‌రైన వ్యూహాలు ర‌చిస్తూ ముందుకెళ్తున్నారు. శ‌నివారంర‌ పార్టీ ఎంపీ అభ్య‌ర్ధి ఆత్రం సుగుణ ప్ర‌చారసామగ్రికి సంబంధించి క‌ర‌ప‌త్రాలు, డోర్ స్టిక్క‌ర్ల‌ను పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య కంది శ్రీ‌నివాస రెడ్డి ఆవిష్క‌రించారు. నియోజ‌క వ‌ర్గంలోని ప్రతీ ఇంటికి ఈ క‌ర‌ప‌త్రాలు స్టిక్క‌ర్లు చేరేలా కృషిచేయాల‌ని , పార్టీ ఎంపీ అభ్య‌ర్ధి ఆత్రం సుగుణ విజ‌యం కోసం అంద‌రం క‌లిసి క‌ట్టుగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయిన్ వార్ గంగా రెడ్డి, కొండూరి రవి,సుధాకర్ గౌడ్, రాజ్ మొహమ్మద్, కయ్యుమ్, రఫీక్, ఎల్మ రామ్ రెడ్డి, సురేందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *