సిరా న్యూస్,కమాన్ పూర్;
మాజీ స్పీకర్ దివంగత దుద్దిల్ల శ్రీపాదరావుకు గుండారం కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు.
శ్రీపాదరావు 25వ వర్ధంతి సందర్భంగా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మంథని నియోజకవర్గానికి చేసిన సేవలను కొని ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీపాదరావు అని ఆయన హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఆకుల ఓదెలు గుండారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిడుగు శంకర్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎం ఏ రఫీక్ తోపాటు జంగిలి కనకయ్య పిడుగు స్వామి తంగేనపల్లి నరేష్ వడ్లకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.