బుట్టా రేణుక అమ్మని గెలిపించండి
అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాము
ఎన్నికల ప్రచారంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
నందవరం మండలంలోని జోహారాపురం గ్రామం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్ గారికి గ్రామ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి తనయుడు బుట్టా ప్రతుల్ గారు అన్నారు.జోహారాపురం గ్రామం నందు వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం బుట్టా ప్రతుల్ గారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచారని గుర్తు చేశారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల వద్దే సంక్షేమ పథకాలుఅందించామన్నారు.ఫ్యాన్ ప్రభంజనం ఖాయం మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని బుట్టా ప్రతుల్ గారు అన్నారు. ప్రజా సం కల్ప పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయ న్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాలు కొనసాగలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలన్నారు.రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గారికి,రెండు ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య గారికి వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.