సిరాన్యూస్, కుందుర్పి
ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడద్దు..
* విద్యార్థులకు తల్లితండ్రులు బాసటగా నిలవాలి
* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్
ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు మానసిక ఆందోళనతో కలత చెంది ఆత్మహత్య లకు పాల్పడడం చాలా బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విచారం వ్యక్తం చేసారు. కలెక్టర్, ఎస్ పి, ఉన్నత అధికారులుగా వున్నవారు కూడా ఏదో ఒక పరీక్షలలో ఫెయిల్ అయినవారే అని ఈ సందర్భంగా గుర్తుచేసారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ విద్యార్థులకు వుందని, క్షనీకావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.విద్యాసంవత్సరం నష్టపోకుండా సప్లిమెంటరీ పరీక్ష వుంటుందని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇలాంటి సందర్బంలో తల్లితండ్రులు బాసటగా నిలవాలని, ఉపాధ్యాయులు సరైన సలహ సూచనలు ఇచ్చి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆయన కోరారు.