సిరా న్యూస్, గుడ్ హత్నూర్ :
ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి..
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో వివిధ గ్రామాలలో భారత్ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నీ ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కులసంఘాలు, అదికారులు, కులాలకు, మతాలకు అతీతంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ప్రతి ఒక్క పౌరునికి సమాన హక్కులు, మహిళలకు హక్కులు వచ్చాయని,చదువు హక్కు, రిజర్వేషన్లు, రాజకీయాలలో రిజర్వేషన్లు ఇలా చాలా హక్కులు వచ్చాయని అన్నారు. అందుకే అంబేద్కర్ అందరివాడు, జ్ఞానానికి ప్రతీక అయ్యారని అయన జయంతిని విశ్వావ్యాప్తంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ జెడ్పిటిసి పతంగే బ్రహ్మానంద్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తిరుమల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవా దౌలత్ రావ్జయంతి కారెక్రమంలో గుడిహత్నూర్ ప్యాక్స్ కమిటీ చైర్మన్ ముండే సంజీవ్,మాజీ జడ్పీటీసీ మస్కె మాధవ్, ఎస్ ఐ ఇమ్రాన్,సిధార్థ ససానే, గోవింద్ బుద్దె, మాధవ్ కేంద్రే,రావణ్ ముండే, గౌస్, బండారి రవీందర్, కళ్లేపల్లి ప్రేంరాజ్,బడుగు రాజేశ్వర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.