సిరాన్యూస్, బేల
* శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల
* గ్రామపంచాయతీ కమ్యూనిటీ హాల్లో తరగతుల నిర్వహణ
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పిట్ గావ్( ఎల్) ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పై చెట్టు పెరిగి వేర్లు మొత్తం తరగతి గదిలోకి చొచ్చుకొచ్చాయి. భవనం మొత్తం పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాల పక్కనే ఉన్న గ్రామపంచాయతీ కమ్యూనిటీ హాల్ లో 1 నుంచి 5వ తరగతి వరకు 36 మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఉన్నది ఒక్కటే గది వీరందరికి ఒక్కరే టీచర్ అని ప్రధానోపాధ్యాయుడు కె. బాలకృష్ణ తెలిపారు.