కుప్పం మీదుగా బెంగళూర్ వెళ్ళే రైళ్లు ఆలస్యం

సిరా న్యూస్,చిత్తూరు;
వాణీయంబాడి సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో కుప్పం మీదుగా బెంగళూరు వెళ్ళే పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎప్పుడు రైలు వస్తుందో తెలిదని రైల్వే శాఖ అధికారులు సమాచారం. తిరుపతి నుండి కుప్పం మీదుగా బెంగళూరు వెళ్ళే ఇంటర్సిటీ వానియంబాడిలో, చెన్నై నుండి కుప్పం మీదుగా బెంగళూరు వెళ్ళే లాల్బాగ్ రైలు వలతూర్ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ ఆపేసారు. యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టారు. రైళ్లు ఆలస్యం కావడంతో కుప్పం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *